బాలీవుడ్లో అలా.. టాలీవుడ్లో ఇలా: జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తెలుగులో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తారన్న జాన్వీ
- బాలీవుడ్ సినిమాలు షెడ్యూల్స్ ప్రకారం నడుస్తాయని వెల్లడి
- టాలీవుడ్లో పని వేళలు సౌకర్యవంతంగా ఉంటాయని కితాబు
- భోజన విరామ సమయాలను కచ్చితంగా పాటిస్తారని వ్యాఖ్యలు
- హిందీ సినిమాలు త్వరగా పూర్తవుతాయని చరణ్ ప్రశంస
టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పని సంస్కృతిపై నటి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా సెట్స్లో ఇచ్చే గౌరవం, అక్కడి వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటించిన జాన్వీ రెండు పరిశ్రమల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను పంచుకున్నారు.
క్రియేటివిటీకే ప్రాధాన్యం
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా సినిమాపై ఉన్న ఇష్టం, పట్టుదలతో నడుస్తుందని జాన్వీ కపూర్ అభిప్రాయపడ్డారు. మంచి సినిమా తీయడం కోసమే ఇక్కడి దర్శకులు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. అవసరమైతే నిర్మాణ సమయాన్ని పొడిగిస్తారని పేర్కొన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ కంటే సృజనాత్మకతకే ఎక్కువ విలువ ఉంటుందని వివరించారు. హిందీ పరిశ్రమలో మాత్రం అంతా పక్కా ప్రణాళిక, గడువుల ప్రకారం జరుగుతుందని చెప్పారు. బాలీవుడ్లో సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్నిసార్లు కథ విషయంలో రాజీ పడాల్సి వస్తుందని వివరించారు.
భోజన విరామానికి ప్రత్యేక గౌరవం
తెలుగు సినిమా సెట్స్లో నటీనటులు, సాంకేతిక నిపుణులను చూసుకునే విధానం అద్భుతంగా ఉంటుందని జాన్వీ ప్రశంసించారు. ఇక్కడ పని వేళలు చాలా పద్ధతిగా ఉంటాయని, అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుందని చెప్పారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్ను ఇక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారని వెల్లడించారు. సెట్స్లో అందరూ ప్రశాంతంగా తిని, మళ్లీ ఉత్సాహంగా పని చేసేలా ప్రోత్సహిస్తారని అన్నారు. రోజుకు 9 నుంచి 10 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తారని, నైట్ షూట్స్ కూడా తెల్లవారుజామునే ముగించి విశ్రాంతి ఇస్తారని వెల్లడించారు. ముంబైలో ఇలాంటి వాతావరణం కనిపించదని స్పష్టం చేశారు.
చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్లో సినిమాలు చాలా వేగంగా ముగుస్తాయని, ఆ పనితీరు తనకు ఎంతో ఇష్టమని హీరో రామ్ చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసమే రెండు సంవత్సరాల కాలంలో సుమారు 285 రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. దీనిపై జాన్వీ స్పందిస్తూ బాలీవుడ్లో కొన్ని సినిమాలు కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే పూర్తయిపోతాయని చెప్పారు. రెండు పరిశ్రమల నిర్మాణ శైలిలో ఎంతో తేడా ఉందని అన్నారు.
క్రియేటివిటీకే ప్రాధాన్యం
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా సినిమాపై ఉన్న ఇష్టం, పట్టుదలతో నడుస్తుందని జాన్వీ కపూర్ అభిప్రాయపడ్డారు. మంచి సినిమా తీయడం కోసమే ఇక్కడి దర్శకులు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. అవసరమైతే నిర్మాణ సమయాన్ని పొడిగిస్తారని పేర్కొన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ కంటే సృజనాత్మకతకే ఎక్కువ విలువ ఉంటుందని వివరించారు. హిందీ పరిశ్రమలో మాత్రం అంతా పక్కా ప్రణాళిక, గడువుల ప్రకారం జరుగుతుందని చెప్పారు. బాలీవుడ్లో సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్నిసార్లు కథ విషయంలో రాజీ పడాల్సి వస్తుందని వివరించారు.
భోజన విరామానికి ప్రత్యేక గౌరవం
తెలుగు సినిమా సెట్స్లో నటీనటులు, సాంకేతిక నిపుణులను చూసుకునే విధానం అద్భుతంగా ఉంటుందని జాన్వీ ప్రశంసించారు. ఇక్కడ పని వేళలు చాలా పద్ధతిగా ఉంటాయని, అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుందని చెప్పారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్ను ఇక్కడ చాలా సీరియస్గా తీసుకుంటారని వెల్లడించారు. సెట్స్లో అందరూ ప్రశాంతంగా తిని, మళ్లీ ఉత్సాహంగా పని చేసేలా ప్రోత్సహిస్తారని అన్నారు. రోజుకు 9 నుంచి 10 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తారని, నైట్ షూట్స్ కూడా తెల్లవారుజామునే ముగించి విశ్రాంతి ఇస్తారని వెల్లడించారు. ముంబైలో ఇలాంటి వాతావరణం కనిపించదని స్పష్టం చేశారు.
చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్లో సినిమాలు చాలా వేగంగా ముగుస్తాయని, ఆ పనితీరు తనకు ఎంతో ఇష్టమని హీరో రామ్ చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసమే రెండు సంవత్సరాల కాలంలో సుమారు 285 రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. దీనిపై జాన్వీ స్పందిస్తూ బాలీవుడ్లో కొన్ని సినిమాలు కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే పూర్తయిపోతాయని చెప్పారు. రెండు పరిశ్రమల నిర్మాణ శైలిలో ఎంతో తేడా ఉందని అన్నారు.